ఆకట్టుకుంటోన్న ‘సింహాసనం’ ఫస్ట్ లుక్ 

ఆకట్టుకుంటోన్న ‘సింహాసనం’ ఫస్ట్ లుక్
సౌత్ లోని మోస్ట్ టాలెంటెడ్  యాక్టర్స్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకడు. ప్రధానంగా మళయాల సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులోనూ కొన్ని డబ్బింగ్ సినిమాలతో సత్తా చాటాడు.చిరంజీవి రీమేక్ చేస్తాడు అని చెబుతోన్న ‘లూసీఫర్’మళయాల చిత్రానికి దర్శకుడు పృథ్వీరాజ్ కావడం విశేషం. అలాగే ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చల్లో ఉన్న చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియం’లో నటనకు అద్భుతమైన ప్రశంసలు అందుకుంటున్నాడు.  నటుడుగానూ, దర్శకుడుగానూ సత్తా చాటుతోన్న పృథ్వీరాజ్ మళయాలంలో నటించిన ఓ సూపర్ హిట్ సినిమాను తెలుగులో ‘సింహాసనం’పేరుతో డబ్ చేశారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను అభిరుచి కలిగిన చిత్రాలతో ఆకట్టుకుంటోన్న నిర్మాత మధుర శ్రీధర్ చేతుల మీదుగా విడుదల చేశారు. ‘సింహాసనం’ అనే టైటిల్ తో తెలుగులో రాబోతోన్న ఈ చిత్రానికి అత్యంత ప్రతిభావంతమైన  పేరు తెచ్చుకున్న షాజీ కైలాష్ దర్శకత్వం వహించాడు.
సింహాసనం సినిమాతో శ్రీ చక్ర మల్లిఖార్జున నిర్మాతగా తెలుగు పరిశ్రమలో అడుగుపెడుతున్నాడు. మొదటి చిత్రం డబ్బింగ్ అయినా.. తెలుగులోనూ పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. పృథ్వీరాజ్ సరసన వందన మీనన్, ఐశ్వర్య దేవన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మళయాంలో మ్యూజికల్ గానూ పెద్ద విజయం సాధించింది. రోన్నీ రాఫెల్ సంగీతం అందించిన ఈ పాటలను తెలుగులో ఎమ్ఎమ్ శ్రీలేఖ, ధనుంజయ్, సురేష్ పాడటం విశేషం. ఇక  పృథ్వీరాజ్ తో పాటు సాయికుమార్ ఓ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో సనా, దేవన్, సిద్ధిఖీ ఇతర పాత్రల్లో నటించారు. తెలుగులో మాటలు, పాటలను భారతీబాబు రాశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *