మైత్రీ మూవీస్ నిర్మాణంలో మ‌రిన్ని పెద్ద సినిమాలు

మైత్రీ మూవీస్ నిర్మాణంలో మ‌రిన్ని పెద్ద సినిమాలు
మైత్రీ మూవీస్ అంటే ఇప్పుడు పెద్ద నిమాల‌కు కేరాఫ్
అడ్ర‌స్ గా మారింది. ప్ర‌స్తుతం రిలీజ్ సిద్ధంగా ఉన్న చిత్రాలు… షూటింగ్ జ‌రుగుతున్న చిత్రాలు… చ‌ర్చ‌లు జ‌రుగుతున్న చిత్రాలు… భ‌విష్య‌త్తులో రాబోయే చిత్రాల వివ‌రాల‌ను వివ‌రించారు మైత్రీ మూవీస్ బ్యాన‌ర్ నిర్మాత‌లు న‌వీన్‌, ర‌విశంక‌ర్‌.
వైష్ణ‌వ్ తేజ్ హీరోగా… బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ప్రేమ కావ్యం `ఉప్పెన‌` చిత్రం ఈ రోజు రిలీజ్ అవుతుంది. అదే విధంగా సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు – ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` చిత్రం ఇటీవ‌లే దుబాయ్‌లో షూటింగ్ ప్రారంభం అయ్యింది. ష‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. వీటితో పాటుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేష‌న్ వ‌స్తున్న హ్యాట్రిక్ మూవీ `పుష్ప‌` చిత్రాన్ని కూడా మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మ‌రో షెడ్యూల్ హైద‌రాబాద్‌లో ఉంటుంది.
ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రియు ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్ ఓ చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. నాచుర‌ల్ స్టార్ నాని – వివేక్ ఆత్రేయ ద‌ర్శక‌త్వంలో  `అంటే సుంద‌రానికి`మూవీ తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రం షూటింగ్ కూడా త్వ‌ర‌లో ప్రారంభం కానుంది.
అలాగే మెగాస్టార్ చిరంజీ ద‌ర్శ‌కుడు బాబీ కాంబినేష‌న్  మ‌రో చిత్రాన్ని అనౌన్స్ చేశారు. అంతే కాకుండా న‌ట‌సింహం బాల‌కృష్ణ ద‌ర్శ‌కుడు గోపించ‌ద్ మ‌లినేని, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌త్వంలో చిత్రాల‌కు కూడా ఉంటాయ‌ని ఇటిలే ప్ర‌క‌టించారు నిర్మాత‌లు న‌వీన్‌, ర‌విశంక‌ర్‌. విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రియు శివ నిర్వాణ కాంబినేష‌లో కూడా మ‌రో చిత్రం ఉంటుంది.
వీటితో పాటు బాహుబ‌లి ప్ర‌భాస్ హీరోగా పాన్ ఇండియా చిత్రాన్ని ఒక‌టి నిర్మిస్తామ‌ని.. ఆ చిత్రానికి సంబంధించిన వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్న‌ట్లు తెలిపారు మైత్రీ మూవీస్ నిర్మాత‌లు న‌వీన్‌, ర‌వి శంక‌ర్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *