500K మార్క్ కి చేరుకున్న ‘చిరు..రామ్ చరణ్’

500K మార్క్ కి చేరుకున్న ‘చిరు..రామ్ చరణ్’

నిన్న..మొన్నటి వరకు సోషల్ మీడియాకి దూరంగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవిగారు..ఆయన తనయుడు రామ్ చరణ్ గారు..ఈ మధ్యే తండ్రికొడుకులిద్దరై ట్విట్టర్ ఖాతాని తెరిచారు. ట్విట్టర్ లో పలు విషయాలతో పాటు తమ ఫ్యామిలీ విషయాలను పంచుకుంటున్నారు వీరిద్దరూ. దాంతో వీరికి ఎనలేని ఫాలోవర్స్ యాడ్ అయ్యారు..తాజాగా వారి ఫాలోవర్స్ సంఖ్య 5 లక్షలకి చేరుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఫాలోవర్స్ సంఖ్య 506.5 కే కాగా, రామ్ చరణ్ ఫాలోవర్స్ సంఖ్య 500.3కే గా ఉంది. ట్విట్టర్‌లోకి అడుగుపెట్టినప్పటి నుండి తండ్రి కొడుకులు ఇద్దరు తమదైన శైలిలో ట్వీట్స్ చేస్తూ అలరిస్తున్నారు. చిరు, రామ్ చరణ్ ఒకేసారి 500 కే మార్క్ చేరుకోవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.