“శరపంజరం”చిత్రం లోని మొదటి పాటను విడుదల చేసి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్

“శరపంజరం”చిత్రం లోని మొదటి పాటను విడుదల చేసి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్

గంగిరెద్దుల అబ్బాయి జోగిని అమ్మాయి ప్రేమలో పడితే ఎం జరిగింది. ఆఊరి దొర మరియు గ్రామ ప్రజలు వీరిపై ఎలాంటి  వ్యతిరేకత కనపరచారు అనే  పల్లెటూరు నేపధ్యంలో సాగే కథాంశంతో వస్తున్న చిత్రమే “శరపంజరం” .దోస్తాన్ ఫిలిమ్స్ బ్యానర్ పై నవీన్ కుమార్ గట్టు, లయ జంటగా నవీన్ కుమార్ గట్టు దర్శకత్వంలో టీ. గణపతి రెడ్డి ,మల్లిక్ ఎం వీ కే నిర్మిస్తున్న ఈ చిత్రం లోని  మొదటి పాటను, మరియు, ఫస్ట్ గ్లిమ్స్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు మొదటి పాటను విడుదల చేయగా..సంగీత దర్శకుడు ఆర్. పి.పట్నాయక్ ఫస్ట్ గ్లిమ్స్ ను విడుదల చేశారు. మామిడాల హరికృష్ణ ,ఉడుగుల వేణు లు నాలుగు నిమిషాల డి.సి.పి ని రిలీజ్ చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో ఈటెల జమున, లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్, చరణ్, మరాఠీ దర్శకుడు నవీన్ దేశబోయిన, టిప్స్ మ్యూజిక్ రాజు హిర్వాని, దర్శకుడు వినయ్ బాబు గౌడ్, మ్యూజిక్ డైరెక్టర్, యమ్.అల్. రాజ, అమూల్యతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా

ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..కాలం మారినా ఇంకా కొన్ని చోట్ల జోగిని లాంటి దూరాచారాలు మారకుండా ఇంకా కొనసాగుతున్నాయి.వాటిని రూపు మాపే క్రమంలో చిత్ర, దర్శక, నిర్మాతలు జోగిని వంటి సామాజిక సబ్జెక్ట్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమాలో హీరో,హీరోయిన్ లు చాలా బాగా నటించారు. పాటలు చాలా బాగున్నాయి.మంచి చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్ర యూనిట్ కు మంచి పేరు రావాలని కోరుతున్నాను అన్నారు.

మామిడి హరికృష్ణ మాట్లాడుతూ… చిన్నప్పటి నుండి వేదికలపై కళలను ప్రదర్శించిన కళాకారుడు సినిమాలో కనిపించాలి.తన కథలను సినిమాగా తెరకెక్కించాలి తనే నటించాలి.తనే కనిపించాలి. తన హృదయాన్ని తెరపై ఆవిష్కరింప జేయాలనే ఒక స్వప్నం. దాదాపు కొన్ని ఏళ్ల నుంచి కల కంటూ.. కంటూ.. ఉన్న స్వప్నం ఈ రోజు నెరవేరడం వెనుక ఒక పట్టుదల ఉంది.తపన ఉంది.కళ పట్ల ఆరాధన ఉంది.అంతకుమించి సృజనాత్మకంగా గొప్ప గౌరవముంది.ఈ కలకన్న వ్యక్తి ఎవరో కాదు..యువ కళాకారుడు, యువ నటుడు, యంగ్ హీరో నవీన్ కుమార్.ఈ సినిమా కొరకు ఎన్ని కష్టాలు పడ్డాడో ,ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో, ఎన్ని కన్నీళ్లు కార్చాడో తనకే తెలుసు. తను కన్న కలకు డబ్బులు లేవు కానీ మిత్రుల సహకారంతో పాటు ముఖ్యంగా మల్లిక్ తనే ఈ సినిమాకు మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇస్తూ వీరికి తోడుగా నిలిచారు.మరీ ముఖ్యంగా తెలంగాణ శాసన సబ్యుడు ఈటెల రాజేందర్ గారి సహకారం కూడా లభించింది.ఇలా అందరి సహకారంతో అంతరించి పోతున్న మన జీవనశైలిని తెరమీద ఆవిష్కరిస్తున్న గొప్ప సినిమా “శరపంజరం”.మంచి సబ్జెక్ట్ తో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.

ఆర్ర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ.. ఈ సినిమా క్లిప్పింగ్ చూసిన తరువాత జోగిని వంటి దురాచారాన్ని రూపు మాపాలని తేలియజెస్తూ తీసిన చిత్రమే “శరపంజరం”.ఈ సినిమా కోసం టీం అంతా చాలా కస్థపడ్డారు. ఇలాంటి వ్యవస్థల గురించి నేటి తరం అంతా ప్రశ్నించే విధంగా మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుతూ ఈ సినిమా గొప్పవిజయం సాదించాలి అన్నారు.

ఈటెల జమున మాట్లాడుతూ.. “శరపంజరం చిత్ర టైటిల్ లోనే ప్రజలకు పెద్ద అర్థమయ్యేటట్లు ఉంది. ఈ మధ్య ఎక్కువగా యూత్ సినిమాలు వస్తున్నాయి. జోగినిలు ఎలా బాధపడుతున్నారు ఇది ఆచారమనే పద్ధతి కాకుండా దూరాచారమనే విషయాన్ని తెలిపే సినిమా కాబట్టి.ఇలాంటి సినిమాలు గ్రామాల్లో వుండే మహిళలు కనెక్ట్ అయ్యే విధంగా తీసుకెళ్లాలి..అలా తీసుకెళితే తెలంగాణలో వుండే మహిళల గుండెలకు హత్తుకునేలా ఉంది ఈ సినిమా.ఈ సినిమా చూసిన తరువాత ఇన్ని రోజులు ఇలాంటి దురాచారం చేశామా అని ఏడ్చే వారు ఎంతో మంది ఉంటారు.ఇలాంటి మంచి సినిమా తీయడం తెలంగాణ ప్రజల అదృష్టంగా బావిస్తున్నాను.ఇలాంటి దూరచరమైన విషయాలు ఎమున్నాయో తెలుసుకుని వాటిని సినిమా రూపంగా తీసి ఈ వ్యవస్ట ను అభివృద్ధి చేయాలని మా మనస్ఫూర్తిగా కోరుతూ మా మల్లిక్ కు,నవీన్ పట్నాయక్ లకు మూడు పూవులు ఆరు కాయలు కాయాలని దీవిస్తూ.. ఈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *