“ధీరజ అప్పాజీ”కి వాడుక భాషా ఉద్యమ పితామహుడు *గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారం*!!

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ – పి.ఆర్.వో.
“స్వాతిముత్యం” సంపాదకుడు
“ధీరజ అప్పాజీ”కి
వాడుక భాషా ఉద్యమ పితామహుడు
*గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారం*!!

సినిమా జర్నలిజంలో చేస్తున్న కృషికి గాను సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ – పి.ఆర్.ఓ – “స్వాతిముత్యం” సంపాదకుడు ధీరజ అప్పాజీని ప్రతిష్టాత్మక గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారం వరించింది. “వాడుక భాషా ఉద్యమ పితామహుడు” గిడుగు రామ్మూర్తి పంతులు 83వ వర్ధంతిని పురస్కరించుకుని… “శంకరం వేదిక”తో కలిసి గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ నిర్వహించిన వేడుకలో అప్పాజీ ఈ పురస్కారం అందుకున్నారు. తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ డా.జి.రాధారాణి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి తెలంగాణ బి.సి.కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు, ఇన్కమ్ టాక్స్ కమిషనర్ జీవన్ లాల్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహిత్య – కళ – సేవా రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్న పలువురికి ఈ పురస్కారాలు ప్రదానం చేశారు. హైదరాబాద్, సుందరయ్య విజ్ఞానకేంద్రంలో శనివారం సాయంత్రం అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ అధ్యక్షురాలు మరియు గిడుగు రామ్మూర్తి పంతులు వారసురాలు “శ్రీమతి గిడుగు కాంతికృష్ణ”, ఈ సంస్థ ప్రధాన కార్యదర్శి మరియు ప్రముఖ పాత్రికేయులు – కవి – కళారత్న డా.బిక్కిన కృష్ణ, “శంకరం వేదిక” అధ్యక్షురాలు శ్రీమతి యలవర్తి ధనలక్ష్మి, సుమన్ టివి సినిమా విభాగం క్రియేటివ్ హెడ్ ప్రభు, శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనాాయణ తదితరులు పాలుపంచుకున్నారు!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *