ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎదిగిన నన్ను కావాలని వివాదంలోకి లాగుతున్నారు-ప్రదీప్

ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎదిగిన నన్ను కావాలని వివాదంలోకి లాగుతున్నారు-ప్రదీప్

పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఇటీవల ఓ యువతి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. తనపై 143 మంది లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఆ యువతి పేర్కొన్న జాబితాలో ప్రముఖ యాంకర్‌ మాచిరాజు ప్రదీప్‌ పేరు కూడా ఉంది. దీంతో సోషల్ మీడియా వేదికగా ప్రదీప్‌పై భారీ ట్రోలింగ్ జరుగుతోంది. ఈ ట్రోలింగ్‌పై ప్రదీప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనపై, తన కుటుంబంపై మానసిక అత్యాచారానికి పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు తాజాగా ఓ వీడియో విడుదల చేశాడు.  అందరికీ నమస్కారం. గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో నా మీద వస్తున్న ఆరోపణలు ఎంతో బాధాకరం. నిజానిజాలు తెలుసుకోకుండా నా ఫొటోలు వాడుతూ, నా మీద ఆర్టికల్స్ రాసేస్తున్నారు. చాలా సున్నితమైన వివాదంలోకి నన్ను లాగి ఉద్దేశపూర్వకంగానే అటాక్ చేస్తున్నారు. అవతలి వ్యక్తులు నా పేరు ఎందుకు పెట్టారో తెలుసుకోకుండా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌ చేస్తున్నారు. వ్యూస్ కోసం నన్ను టార్గెట్ చేస్తున్నారు. నన్ను, నా కుటుంబాన్ని మానసికంగా అత్యాచారం చేస్తున్నారు. ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎదిగిన నన్ను కావాలని వివాదంలోకి లాగుతున్నారు. అనవసరమైన ఆరోపణలతో నా సన్నిహతులు, అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ వివాదంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నిజానిజాలు ఖచ్చితంగా బయటకు రావాలి. సోషల్ మీడియాలో నాపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాన`ని ప్రదీప్ పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *